హైదరాబాద్ : రూ.50వేలలోపు పంట రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీలో భాగంగా ప్రభుత్వం ఈ నెల 16 నుంచి నిధులు పంపిణీ చేస్తున్నది. ఇవాళ 12,280 మంది రైతుల ఖాతాల్లో.. రూ. 36.29 కోట్లు జమ చేసింది. ఇప్పటివరకు 63,074 మంది రైతుల ఖాతాల్లో.. రూ.172.86 కోట్లు జమ చేసినట్లు అధికారులు తెలిపారు. రూ. 25 వేల నుంచి రూ.50 వేల లోపు రుణాలున్న రైతులకు రైతుబంధు తరహాలో ఖాతాల్లో సర్కారు నేరుగా నిధులు జమ చేస్తున్నది. తక్కువ మొత్తం ఉన్న వారి నుంచి ప్రారంభించి రూ. 50 వేల వరకు ప్రాధాన్య క్రమంలో నిధులు జమ అవుతున్నాయి. రూ. 50 వేల లోపు రుణాలు మాఫీ చేసేందుకు ప్రభుత్వం 2005.85 కోట్లు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6, 61,811 మందికి రైతులకు లబ్ధి చేకూరనుంది.