హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): వచ్చే వానకాలం నుంచి రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమల్లోకి తీసుకొస్తున్నందున పంట రుణాల మంజూరులో పారదర్శకత పాటించాలని వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు సూచించారు. ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆదేశాల మేరకు 2024-25 పంట రుణ పరిమితి అంశాలపై శనివారం రాష్ట్ర సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్రావు మాట్లాడుతూ.. బ్యాంకర్లు తప్పనిసరిగా రైతులు సాగు చేసే పంటలను నమోదు చేయాలని సూచించారు. తద్వారా పంటల బీమా పథకం నిర్వహణ సజావుగా సాగడానికి, పంట నష్టపోయిన సందర్భంలో రైతులను ప్రభుత్వం ఆదుకోవడానికి వీలవుతుందని చెప్పారు.