హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): రెండునెలలుగా కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం మంజూరు చేసింది. 29జిల్లాల్లో 41,361మంది రైతులకు సంబంధించి 51,528 ఎకరాల్లో పంటనష్టం సంభవించినట్టు వ్యవసాయశాఖ నివేదించింది. దీంతో పరిహారం కింద ఎకరాకు రూ.10వేల చొప్పున రూ.51.52 కోట్లు నిధులను మం జూరు చేసినట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ నిధులను త్వరలోనే నష్టపోయిన రైతుల ఖాతాల్లో జమ చేస్తామని పేర్కొన్నారు. నష్టపోయిన పంటల్లో వరి 36,424 ఎకరాలు, మొకజొన్న 3,266 ఎకరాలు, జొన్న 470 ఎకరాలు, ఉద్యాన పంటలు 6,589 ఎకరాలు, పత్తి 4,753 ఎకరాలతోపాటు, ఇతర పంటలు 477ఎకరాల్లో దెబ్బతిన్నాయని వెల్లడించారు. అలాగే మే నెలలో పంటలకు జరిగిన నష్టపరిహాన్ని కూడా ఇవ్వనున్నట్టు ఆయన వెల్లడించారు.