వరంగల్ రూరల్ : జలాశయంలో ఉండాల్సిన మొసలి ఊర చెరువు వద్దకనిపించడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఖానాపురం మండలం పాకాల సరస్సు నుంచి కొట్టుకొచ్చిన మొసలి సమీపంలోని పాపయ్యపేట సుద్దరేవుల చెరువు కట్ట వద్ద చనిపోయి నీటిపై తేలుతూ కనిపించింది. పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు గుర్తించి బయటికి తీసి ఒడ్డుకు చేర్చారు. కాగా, ఇంకా ఎన్ని మొసళ్లు నీళ్లలో ఉన్నాయో అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Dalit Bandhu | కాంగ్రెస్ అక్కసు.. దళితులను అడ్డుకున్న హస్తం నేతలు