హుజూరాబాద్ : దళిత బంధు పథకం కాంగ్రెస్ శ్రేణుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. అద్భుతమైన పథకానికి సీఎం కేసీఆర్ అంకురార్పణ చేస్తుండటంతో.. తమ పునాదులు కదిలిపోతున్నాయని ఉలిక్కిపడుతున్నారు. ఎలాగైనా దళిత బంధు పథకాన్ని ఆపాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకులు కుట్రలకు పాల్పడుతున్నారు.
దళిత బంధు పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్తున్న దళితులను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. వీణవంక మండల కేంద్రం నుంచి దళితులతో బయల్దేరిన బస్సుకు కాంగ్రెస్ శ్రేణులు అడ్డుగా వెళ్లారు. ఆ బస్సును ముందుకు కదలనివ్వకుండా అడ్డుకున్నారు. దళిత బంధుపై కాంగ్రెస్ నాయకులు అక్కసు వెళ్లగక్కుతూ.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు.
ఈ పథకాన్ని అడ్డుకునే వారంతా దళిత ద్రోహులేనని దళితులు మండిపడ్డారు. నోటికాడి ముద్దను గుంజుకునే కుట్రలకు పాల్పడుతున్న దళితద్రోహులను వదిలిపెట్టబోమని, అలాంటివారికి రాజకీయంగా బుద్ధిచెప్తామని హెచ్చరించారు.