నారాయణపేట : కృష్ణ మండలం మురహరిదొడ్డి గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ పొలంలో మొసలి ప్రత్యక్షమైంది. గురువారం ఉదయం పొలం పనులకు వెళ్తున్న కూలీలకు మొసలి కనిపించడంతో వారు భయాందోళనకు గురయ్యారు. ఇక తక్షణమే గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. స్థానికుల సహాయంతో అధికారులు మొసలిని బంధించారు. అనంతరం ఆ మొసలిని కృష్ణా నదిలో వదిలేశారు. పంట పొలాల్లో ప్రత్యక్షమైన మొసలిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.