సూర్యాపేట: రాష్ట్రంలోని సూర్యాపేటకు చెందిన యువకుడు మలేషియాలో మృతిచెందాడు. సూర్యాపేట పట్టణానికి చెందిన మోటకట్ల వెంకటరమణారెడ్డి, మాధవిల కుమారుడు రిశివర్ధన్ రెడ్డి(21) మలేషియాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఓ ప్రైవేటు షిప్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అతను సోమవారం నాడు మృత్యువాత పడ్డాడు.
సోమవారం ఉదయం షిప్పై నుంచి సముద్రంలో పడిపోవడంతో అతను మృతి చెందినట్లు మలేషియా అధికారులు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్లు మృతుని తల్లిదండ్రులు తెలిపారు. వారం క్రితమే తమ బిడ్డ ఫోన్ చేశాడని, విధుల పట్ల వత్తిడి చేస్తున్నట్లు చెప్పాడని ఆ తల్లిదండ్రులు వాపోతున్నారు.
త్వరలోనే వేరే కంపెనీకి మారతానని చెప్పిన కుమారుడు వారంలోనే మరణించినట్లు వార్త వచ్చిందని బోరున విలపిస్తున్నారు. తమ కుమారుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.