హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరుగుతున్నది. రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ ట్యాక్స్ రద్దుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ వాహన (ఈవీ) పాలసీ 2020-30తో వాహనదారులు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. నవంబర్ 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల ఈవీలు కలిపి 8,670 కొనుగోలు చేశారు. వీటిలో 7 వేలకుపైగా ద్విచక్రవాహనాలు, 919 ఫోర్వీలర్లు, 57 ఆటోరిక్షాలు ఉన్నాయి. ఈ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ ట్యాక్స్ కలిపి ప్రభుత్వం రూ.32,96,65,000 మాఫీ చేసింది.