హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ను రద్దు చేయాలని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం (సీపీఎస్టీఈఏ) తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సీపీఎస్టీఈఏ నేతలు శుక్రవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందజేశారు. పాత పెన్షన్ ను పునరుద్ధరించాలని కోరారు. డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాముక కమలాకర్, ప్రధానకార్యదర్శి చీటి భూపతిరావు, టీవీ ప్రసాద్, రఘునందన్ తదితరులున్నారు.