సిద్దిపేట: ప్రతి ఒక్కరూ సీపీఆర్(CPR) విధానాన్ని నేర్చుకుని ప్రాణాపాయస్థితిలో ఉన్న బాధితులను కాపాడాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీశ్రావు(Minister Harish rao) కోరారు. సిద్ధిపేట జిల్లా(Siddipet) పోలీసు కన్వెన్షన్ హాల్ లో ఆదివారం ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సీపీఆర్ పై శిక్షణ(Training) నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఆర్ నేర్చుకుంటే 50 శాతం మందిని బతికించొచ్చని వెల్లడించారు. కార్డియాక్ అరెస్టుతో స్పృహ కోల్పోయిన వ్యక్తులను తిరిగి స్పృహలోకి తెచ్చేందుకు సీపీఆర్ విధానం ఎంతో అవసరమని అన్నారు. దేశ వ్యాప్తంగా 2 శాతం మందికి మాత్రమే సీపీఆర్ పై అవగాహన ఉన్నదని తెలిపారు. దేశంలో సడెన్ కార్డియాక్ అరెస్టుతో 15 లక్షల మంది చనిపోతున్నారు. రాష్ట్రంలో 4 వేల మంది చనిపోతున్నారని పేర్కొన్నారు.
సీపీఆర్ పై రాష్ట్ర వ్యాప్తంగా 18,850 మందికి ఇప్పటి వరకు శిక్షణ అందిస్తున్నామని ఆయన తెలిపారు. హార్ట్ఎటాక్ వేరు సర్డెన్ కార్డియాక్ అరెస్ట్ వేర్వేరుగా ఉంటాయని వివరించారు. గుండె సమస్యలతో బాధపడేవారికి తక్షణమే వైద్యం అందించేందుకు రూ.15 కోట్లతో ఏఈడీ మిషనరీలు ఆసుపత్రులలో అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు.
సిద్ధిపేట జిల్లా తరహాలోనే పోలీస్ హెల్త్ ప్రోఫైల్ మిగతా అన్నీ జిల్లాలో నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్,జడ్పీ చైర్మన్ రోజాశర్మ, గిడ్డంగి కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, పోలీసు కమిషనర్ శ్వేత, డీఎంహెచ్వో డాక్టర్ కాశీనాథ్, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.