తిరుమలాయపాలెం, మార్చి 15: కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఈనెల 17నుం చి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య బస్సు యాత్రలు చేపడుతున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.
ఖమ్మం జిల్లా తిరుమలాయపా లెం మండలం పిండిప్రోలులో బుధవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ సర్కారు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్పరం చేస్తూ పెట్టుబడిదారులకు ప్రభుత్వ సొమ్మును దోచిపెడుతున్నదని విమర్శించారు.