మిర్యాలగూడ, డిసెంబర్ 3: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించకుండా విజయోత్సవాలు నిర్వహించడం ఏమిటని సీపీ ఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహిస్తున్న సీపీఎం జిల్లా మహాసభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయంలో అనేక హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయడం లేదని ఆరోపించారు.