మిర్యాలగూడ, జూన్ 20: మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం కనుమరుగవుతుందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆందోళన వ్యక్తంచేశారు.
మంగళవారం ఆయన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఎన్నికల సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. 2024లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగం మరణ శాసనంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.