హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో మత విద్వేషాలకు తావులేదని, అందుకు ప్రయత్నించే దుష్టశక్తులను ఐక్యంగా తిప్పికొడదామని ప్రజాస్వామిక లౌకికవాద శక్తులకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మతం పేరుతో ప్రజల నడుమ విభజన తేవాలని చూసే స్వార్థ రాజకీయాలను తిప్పికొట్టేందుకు తమతో కలిసిరావాలని బుద్ధిజీవులను, మేధావులను ఆహ్వానించారు.
సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆ పార్టీ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మె ల్యే జూలకంటి రంగారెడ్డి, కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు శనివారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మతం పేరుతో చిచ్చు పెట్టేందుకు కుట్రలు చేస్తున్న వారి కుట్రలను తిప్పికొట్టేందుకు కదలిరావాలన్న పిలుపున కు స్పందించి, మద్దతు ప్రకటించేందుకు వచ్చిన సీపీఎంకు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ పోరాటానికి మద్దతు ఇస్తామ ని సీపీఎం నేతలు తెలిపారు. ప్రజా సమస్యలపై సీఎంకు వినతిపత్రం అందించారు.