మధిర టౌన్, మార్చి 22: మతోన్మాద బీజేపీని ఓడించడమే బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. జనచైతన్య యాత్రలో భాగంగా బుధవారం ఖమ్మం జిల్లా మధిర, వైరాలో జరిగిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. మోదీ అధికారం చేపట్టాక అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బీజేపీపై సీఎం కేసీఆర్ చేస్తున్న పోరాటంలో సీపీఎం కూడా భాగస్వామి అవుతుందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ప్రజలే కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.