భద్రాచలం, మే 6: దేశానికి ఆర్ఎస్ఎస్ పెనుముప్పుగా మారిందని సీపీఎం జాతీయ నాయకురాలు బృందా కారత్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలgలో ఏర్పాటు చేసి న తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర మూడో మహాసభలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. హిందూత్వ ఎజెండాతో ఆర్ఎస్ఎస్ భావాలను ఆదివాసీల్లో చొప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అస్తిత్వ రాజకీయాలు ఆర్ఎస్ఎస్ చేతి లో ఆయుధంగా మారాయని విమర్శించారు. మేడారం జాతరలో ఆదివాసీ సంప్రదాయాన్ని రూపుమాపి హిందూ ఆచార వ్యవహారాలను ముందుకు తెచ్చేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు.