హైదబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఎం రెండు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం తెలిపారు. ఈ మేరకు స్థానిక, జిల్లా కమిటీలతో చర్చించిన అనంతరం రాష్ట్ర కమిటీ నిర్ణ యం తీసుకున్నదని పేర్కొన్నారు. ఈ నెల 9, 10 తేదీల్లో హైదరాబాద్లోని ఎంబీ భవన్లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ, రాష్ట్ర కమిటీ సమావేశాల్లో లోక్సభ ఎన్నికలతోపాటు గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, తదితర అంశాలపై చర్చినట్టు తెలిపారు. కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫిభ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మె, గ్రామీణ బంద్కు రాష్ట్ర కమిటీ మద్దతు ప్రకటించినట్టు పేర్కొన్నారు.