మధిర, నవంబర్ 15 : నిర్మాణం పూర్తయిన వంద పడకల హాస్పిటల్ను వెంటనే ప్రారంభించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా మధిర(Madira) పట్టణంలో శుక్రవారం ర్యాలీ(CPM concern) నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలపడంతోపాటు ప్రభుత్వ హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా నాయకుడు శీలం నరసింహారావు మాట్లాడుతూ పేదలకు వైద్య సేవలు అందించడం కోసం గత కేసీఆర్ ప్రభుత్వం మధిరలో చేపట్టిన వంద పడకల దవాఖాన నిర్మాణం పూర్తయిందన్నారు.
దీనిని ప్రారంభించాల్సిన నియోజకవర్గ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు తీరిక లేకపోవడంతో నిరుపయోగంగా మారిందని ఆరోపించారు. వంద పడకల దవాఖాన ప్రారంభం కాకపోవడంతో పేద ప్రజలు ప్రైవేటు హాస్పిటల్స్కు వెళ్తూ లక్షలాది రూపాయలు వెచ్చిస్తూ అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే హాస్పిటల్ ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని డిమండ్ చేశారు.