హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు.
భూసేకరణ చట్టం-2013 చట్టం ప్రకారం పేద రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ నెల 6న సీపీఎం ఆధ్వర్యంలో హైదరాబాదులోని హెచ్ఎండీఏ కార్యాలయం ముందు నిర్వాసితులతో ధర్నా నిర్వహించనున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.