Kunamneni Sabhashiva Rao | దేశంలో సంక్లిష్ట పరిస్థితులు నెలకొని ఉన్నాయని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిపాలన ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని పేర్కొన్నారు. అప్పటి ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ కాలంలో కనీస హక్కులు ఉండేవని, ప్రస్తుత మోడీ ప్రభుత్వ హయాంలో దేశంలో విపక్షాలకు ప్రజలకు కనీస హక్కులు లేకుండా పోయాయని అన్నారు. శనివారం నిజామాబాద్ ఉమ్మడి జిల్లా సిపిఐ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కేంద్ర మోడీ ప్రభుత్వానికి రాబోయే కాలంలో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.
మోదీ స్నేహితులు అదానీ రూ.లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని, రూ.10లక్షల కోట్లు కుంభకోణం చేసినట్లు కూనంనేని తెలిపారు. మోదీ షెల్ కంపెనీలను ప్రమోట్ చేసి లక్షల కోట్లు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ఆదాని కుంభకోణంపై జేపీసీ ఏర్పాటు చేసి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలు కుదేలయ్యాయని, అయ్యాయని వెల్లడించారు. జేబీసీ విచారణ చేపట్టకుండా మోదీ ప్రభుత్వం అడ్డుకుంటుందని, జేపీసీ డిమాండ్ చేస్తున్న వివిధ పార్టీల నాయకులపై కేసులు నమోదు చేస్తుంది ఆరోపించారు. అందులో భాగంగానే కాంగ్రెస్ నాయకులు రాహుల్పై చర్యలు అని ఆరోపించారు. రాహుల్ గాంధీపై కక్ష సాధింపు చర్యలు కేంద్ర చేపట్టిందని, గుజరాత్ సూరత్ కోర్టు శిక్ష, వెంటనే ఎంపీగా అనర్హత, ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్స్ ఖాళీ చేయించిన ఇదంతా ప్రభుత్వ కుట్రలో భాగమేనని ఆయన స్పష్టం చేశారు. దేశంలో 90శాతం సంపద పదిమంది వద్ద మాత్రమే ఉందని, దేశాన్ని కొల్లగొట్టి పారిపోయిన దేశద్రోహుల ఆస్తులు జప్తు చేయాలని సాంబశివరావు డిమాండ్ చేశారు. దేశంపై చూసుకున్న వారి నుంచి వసూలు చేసి ఇచ్చిన ప్రకారం రూ.10 లక్షలు ప్రజల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.
రాబోయే ఎన్నికల్లో మోదీ ప్రభుత్వానికి శిక్ష సాంబశివరావు హెచ్చరించారు. రాష్ట్ర కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కూనంనేని సూచించారు. ఉత్తర తెలంగాణలో బీడీ కార్మికులకు ఇచ్చిన హామీ పింఛన్ అందరికీ అందజేయాలని కోరారు. దళిత బంధు, రెండు పడకల ఇళ్లు పూర్తి చేయలేదని, వెంటనే అందించాలని కోరారు. అమలు చేయాల్సిన బాధ్యత కేసీఆర్దేనన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కుదిరితే పొత్తు లేకుంటే సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేస్తాయని సాంబశివరావు వెల్లడించారు. ఈ నెల 14 నుంచి మే 15 వరకు బీజేపీ హటావో.. దేశ్కి బచావో అనే నినాదంతో ప్రతి ఇంటికి వెళ్లే కార్యక్రమం చేపడుతున్నామని వివరించారు. విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ పద్మ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కంజర భూమన్న, నిజామాబాద్ జిల్లా కార్యదర్శి పీ సుధాకర్,కామారెడ్డి జిల్లా కార్యదర్శి దశరథ్, సీపీఐ జిల్లా నాయకులు వై ఓమయ్య,రాజేశ్వర్, రాజన్న, బాబు, ఏ విఠల్ గౌడ్, దుబాస్ రాములు, బాలరాజ్, రాజమణి, స్వరూప రాణి పాల్గొన్నారు.