హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ప్రజలకు కనీస వసతులు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఐ సీనియర్ నేతలు అజీజ్పాషా, చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ప్రజాహితం పేరుతో సామాజిక కార్యకర్త పొన్నాల గౌరీశంకర్ చేపట్టిన సైకిల్యాత్రను హైదరాబాద్లోని మఖ్దూంభవన్లో శుక్రవారం ప్రారంభించారు. ఏడు దశాబ్దాలకు పైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజా సంక్షేమం గురించి ఆలోచించలేదని అజీజ్పాషా మండిపడ్డారు. సామాజిక చైతన్యం కోసం సాగే గౌరీశంకర్ సైకిల్ యాత్రకు మేధావులు, అన్ని రాజకీయ పార్టీలు మద్దతుగా నిలవాలని కోరారు.