హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఒక లౌకిక పార్టీ అని, బీఆర్ఎస్గా రూపాంతరం చెందడాన్ని తాము స్వాగతిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ చెప్పారు. గురువారం హైదరాబాద్ మగ్దూంభవన్లో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) బీజేపీకి అనుకూలంగా ఉంటే వ్యతిరేకించే వారమని, కానీ బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ ఉంటున్నారని అన్నారు. విజయవాడలో ఈ నెల 14 నుంచి జరిగే సీపీఐ 24వ జాతీయ మహాసభల్లో బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ వేదికకు నిర్దిష్టమైన కార్యక్రమాన్ని ప్రకటించబోతున్నామని, ఆ దిశగా 16న బీజేపీ యేతర సీఎంలను, రాజకీయ నేతలను ఆహ్వానిస్తున్నామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా రూపాంతరం చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ప్రధానిని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిం చి బయ్యారం ఉకు ఫ్యాక్టరీని మంజూరు చేయించాలని, చేతకాకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్చేశారు. చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. మోదీ ప్రభు త్వం ప్రజావ్యతిరేక పాలనతో ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టారని, ప్రజలను మతోన్మాదంతో ఉసిగొలిపి దృష్టి మరలుస్తున్నదని విమర్శించారు. నేతలు అజీజ్ పాషా, పశ్య పద్మ, ఎన్ బాలమల్లేశ్ పాల్గొన్నారు.
రాష్ట్రంలో అట్టడుగువర్గాల అభ్యున్నతికి అన్నివిధాలుగా కృషి చేస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్. రైతులు, కులవృత్తిదారులు అందరికీ లబ్ధి చేకూర్చేవిధంగా అనేక విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టారు. ఎనిమిదేండ్ల స్వల్పకాలంలో తెలంగాణ రాష్ర్టా న్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు. రాష్ర్టానికి వస్తున్న అవార్డులే ఇందుకు నిదర్శనం. తెలంగాణ ప్రగతిని యావ త్ దేశం చూస్తున్నది. ఆ విధానాలే కావాలని దేశం కోరుకొంటున్నప్పుడే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావ డం హర్షణీయం. ముఖ్యం గా రైతు బంధు, రైతబీమా, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ వంటి పథకాలు ఆదర్శం.
– కొండూరు సత్యానారాయణ, ఎంబీసీ సంఘాల రాష్ట్ర కో కన్వీనర్
జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పెనుమార్పునకు నాంది పలుకుతుంది. ముఖ్య మంత్రి కే చంద్రశేఖర్రావు జాతి రుగ్మతలను తప్పకుండా మారుస్తారనే విశ్వాసం మాకున్నది. భాతర దేశ రాజకీయాల్లో ఆరోగ్యవంతమైన పోటీత త్వం, నిజమైన సమాఖ్యస్ఫూర్తి, ప్రజాస్వామ్య పరిరక్షణ వంటి విలువలను టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ పాదుకొలుపుతారు. ఆ నమ్మకం మాకు ఉన్నది. తెలంగాణ ప్రజా సంక్షేమ పథకాలు దేశమంతా అమలుకావాలి.
– సురేశ్ కాలేరు, వంజరి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు