హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): అయోధ్య రామాలయ అంశాన్ని ప్రధాని మోదీ వచ్చే లోక్సభ ఎన్నికలకు ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ విమర్శించారు. హైదరాబాద్ మగ్ధూంభవన్లో బుధవారం ప్రారంభమైన సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రమాదకారిగా మారిందని, సంస్థాగత వ్యవస్థలను నియంత్రిస్తున్నదని విమర్శించారు.