మంథని, ఏప్రిల్ 27: ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి దేశాన్ని రక్షించుకోవాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యు డు చాడ వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు.
గురువారం పెద్దపల్లి జిల్లా మంథని, కమాన్పూర్, రామగిరి, కాల్వశ్రీరాంపూర్, ఓదెల మండలాల్లో నిర్వహించిన సీపీఐ ప్రజా చైతన్య యాత్రలో చాడ పాల్గొని మాట్లా డారు. మోదీ సర్కార్ దేశ సంపదను కార్పొరేట్ పెట్టుబడిదారులకు అప్పగిస్తున్నదని ఆరోపించారు.