హైదరాబాద్, జులై 28 (నమస్తే తెలంగాణ): ఎంపీ సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతున్నది. సామాన్యుల నుంచి రాజకీయనేతలు, సినీతారల వరకు అనేకమంది ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. బుధవారం సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ తన పుట్టినరోజు సందర్భంగా స్వగ్రామమై న చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని ఆయనంబాకంలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… పర్యావరణ పరిరక్షణ కోసం గ్రామస్తులు ప్రతి ఒక్కరు ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొని మొక్క లు నాటాలని పిలుపునిచ్చారు. ఇంత అద్భుతమైన కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ను అభినందించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్లోపాల్గొన్నందుకు సీపీఐ నారాయణకు ఎంపీ సంతోష్కుమార్ ధన్యవాదాలు తెలిపారు. మొక్కలు నాటే కార్యక్రమంలో గ్రామస్తులు పాలుపంచుకోవడం సంతోషంగా ఉందని ట్విట్టర్లో పేర్కొన్నారు.