హైదరాబాద్, ఆగస్టు 15 (నమ స్తే తెలంగాణ): భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర ను, ఆనాటి పోరాటాలను దొంగిలించేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ యత్నిస్తున్నాయని సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్లో సోమవారం ఆయన జాతీయ జెండాను ఎగురవేసి మాట్లాడారు. స్వాతంత్య్ర పోరాటంలో కమ్యూనిస్టులు మహత్తర పాత్ర పోషించారని చెప్పారు. కమ్యూనిస్టు పార్టీ కంటే ఆరునెలల ముందు పుట్టిన ఆర్ఎస్ఎస్ మాత్రం పోరాటంలో ఎక్కడా పాల్గొనలేదని, 1947 తరువాత 52 ఏండ్ల వరకు నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంలో జాతీయ జెండానే ఎగురవేయలేదని పేర్కొన్నా రు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్పాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.