హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): కేంద్రప్రభుత్వంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి మండిపడ్డారు. కేంద్ర హోం మంత్రి అమిత్షా ఎక్కడ అడుగు పెట్టినా.. అక్కడ ఏదో ఒక ప్రభుత్వ ఆస్తిని విక్రయిస్తారని విమర్శించారు. ఇటీవల అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన మరునాడే ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ(సీసీఐ)ని అమ్మకానికి పెట్టారన్నారు. ఇదీ తెలంగాణ ప్రజలకు బీజేపీ ఇచ్చిన బహుమానం అని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఆయన మళ్లీ పర్యటనకు వస్తే సింగరేణి బొగ్గు గనులు అమ్మేందుకు ప్లాన్ చేస్తున్నారేమోనని ధ్వజమెత్తారు.