హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): మతోన్మాద ఆర్ఎస్ఎస్, బీజేపీ విధ్వంసకర చర్యలతో దికుతోచని స్థితిలో దళితులు భయాందోళనతో కాలం వెళ్లదీస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశా రు. హైదరాబాద్ హిమాయత్నగర్లోని మఖ్దూంభవన్లో బుధవారం దళిత హకుల పోరాట స మితి రాష్ట్ర ప్రథమ మహాసభల పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడు తూ దేశంలో నిత్యం దళితులపై దాడులు, మారణహోమాలు జరుగుతూనే ఉన్నాయని ఆరోపించారు. మోదీ ప్రధాని అయ్యాక దళితులపై మరింతగా పెరిగాయని, ఇందుకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికే సాక్ష్యమని చెప్పారు. కులం ఆధారంగా ద్వేషపూరిత నేరాల ఘటనలను అరికట్టడంలో కేంద్రంలోని బీజేపీ సరార్ ఫుర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. దేశమంతటా వివక్ష, సామాజిక బహిషరణను ఎదురుంటున్న దళితులు, ఆదివాసీ వర్గాల బాధలు అత్యంత దారుణంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హకులు కల్పించే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తున్నదని విమర్శించారు.