హనుమకొండ చౌరస్తా/కడెం/నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 2: కేంద్ర బడ్జెట్పై సీపీఐ మండిపడింది. తెలంగాణకు నిధులు కేటాయించక పోవడంపై ఉమ్మడి వరంగల్, నిర్మల్ జిల్లాల్లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. హనుమకొండలోని కాళోజీ విగ్రహం ఎదుట సీపీఐ హనుమకొండ జిల్లా సమితి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్ర విభజన హామీలైన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉకు పరిశ్రమ, ములుగులో గిరిజన యూనివర్సిటీలను కేంద్రం విస్మరించిందని రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తకళ్లపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. నిర్మల్తోపాటు కడెంలోనూ బడ్జెట్ ప్రతులను తగులబెట్టారు.