భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెంలో సీపీఐపార్టీ(CPI) కి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి రాజీనామా చేసి పలువురు సీపీఐ కౌన్సిలర్లు ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR )సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో సీపీఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వై. శ్రీనివాసరెడ్డి , ఒకటో వార్డు కౌన్సిలర్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బోయిన విజయ్ కుమార్, 18 వ వార్డు కౌన్సిలర్ పి.సత్యనారాయణ చారి, 16 వ వార్డు కౌన్సిలర్ మాచర్ల రాజకుమారి, 30 వ వార్డు కౌన్సిలర్ నేరేళ్ల సమైక్య, సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి, మాజీ కౌన్సిలర్ మాచర్ల శ్రీనివాస్, ఏఐటీయూసీ పట్టణ కన్వీనర్ పిడుగు శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.