హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నుంచి ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం రెండు నాలుకల ధోరణి అవలంబిస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి పండిన ప్రతి గిం జను కొనుగోలు చేస్తామని, పార్లమెంట్లో మరో మంత్రి పీయూష్ గోయల్ 40 లక్షల టన్నుల కంటే ఎక్కువ కొనుగోలు చేసే ప్రసక్తే లేదని భిన్నమైన ప్రకటనలతో రైతులను ఆయోమయానికి గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. యాసంగిలో తెలంగాణ నుంచి బియ్యం తీసుకోబోమని కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం బీజేపీ రైతు వ్యతిరేక ధోరణికి నిదర్శనమన్నారు.