హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ప్రమాదకర సిద్ధాంతాలతో దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు మోదీ సర్కారు ప్రయత్నిస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ధ్వజమెత్తారు.
మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పార్టీ 99వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. మోదీ, అమిత్షా ఆధ్వర్యంలోని క్రిమినల్ గ్యాంగ్ దేశాన్ని పాలిస్తున్నదని నిప్పులు చెరిగారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచేది ఎర్రజెండాయేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు.