హైదరాబాద్ నగర శివారులో ఉన్న హిమాయత్ సాగర్కు వరద పోటెత్తింది. దీంతో ఆ ప్రాజెక్టు ఆరు గేట్లు ఆరు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో ఈసీ వాగు ఉప్పొంగింది. దర్గా వంతెన వద్ద ఈసీ వాగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ.. సర్వీస్ రోడ్డుపై ఓ వాహనదారుడు తన బైక్ను ముందుకు పోనిచ్చాడు. సర్వీస్ రోడ్డు మధ్యలోనే ఆ యువకుడు ఆగిపోయాడు.
సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. బాధితుడిని ప్రాణాలతో కాపాడారు. బైక్ను ట్రాఫిక్ వాహనానికి కట్టి వరద నుంచి బయటకు లాగారు. బాధిత యువకుడిని వికారాబాద్ జిల్లా బొంరాస్పేట మండలం దుప్చెర్ల గ్రామానికి చెందిన గౌని అరవింద్ గౌడ్గా పోలీసులు గుర్తించారు. కాగా, తమకు అప్పగించిన విధుల పట్ల అత్యంత చిత్తశుద్ధితో, శ్రద్ధతో విధులు నిర్వహించిన హెడ్ కానిస్టేబుల్ బేగ్ నేతృత్వంలోని రికవరీ వ్యాన్ బృందాన్ని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అభినందిచారు.
వరదల్లో చిక్కుకున్న వ్యక్తి ప్రాణాలు కాపాడిన సైబరాబాద్ పోలీసులు.. అభినందించిన సీపీ #HyderabadRains @HYDTP @hydcitypolice pic.twitter.com/kWaa1Vc8BC
— Namasthe Telangana (@ntdailyonline) July 26, 2022
హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో ఈసీ వాగు ఉప్పొంగింది.. ఆ వరద ఉధృతిలో చిక్కుకున్న వాహనదారుడిని రక్షించిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు.. pic.twitter.com/c8LSDk622Y
— Namasthe Telangana (@ntdailyonline) July 26, 2022