హైదరాబాద్: హైదరాబాద్ మారథాన్ పదో ఎడిషన్ను నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ప్రారంభించారు. నక్లెస్రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి వరకు ఈ మారథాన్ కొనసాగుతుంది. ఇందులో ఆరువేల మంది రన్నర్లు పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు 42 కిలోమీటర్లు (ఫుల్ మారథాన్), 21 కిలోమీటర్లు (హాఫ్ మారథాన్), 10 కే మారథాన్ నిర్వహిస్తున్నారు.
మారథాన్ నేపథ్యంలో పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి మధ్య ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. పలు కూడళ్లలో ట్రాఫిక్ మళ్లింపు చేపడుతున్నారు.