న్యాల్కల్ : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రుక్మాపూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం ఒక ఆవు రెండు దూడలకు జన్మనిచ్చింది. స్థానిక గ్రామానికి చెందిన గొల్ల లక్ష్మన్న అనే రైతుకు చెందిన ఆవు మూడో ఈతలో రెండు కోడెదూడలకు జన్మనిచ్చింది. ఆవు దూడలు ఆరోగ్యంగా ఉన్నాయి. మూడో ఈతలో రెండు కోడెదూడలకు ఆవు జన్మను ఇవ్వడంతో రైతు కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోయారు. ఈ విషయం గ్రామంలో ప్రజలకు తెలియడంతో తరలివచ్చి వాటిని ఆసక్తిగా తిలకించారు.