హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గురువారం 285 మందికి వైరస్ నిర్ధారణ అయింది. పాజిటివిటీ రేటు మొదటిసారిగా ఒక శాతం దాటింది.
యాక్టివ్ కేసుల సంఖ్య 160కి చేరింది. 65 మంది రోగులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. అత్యధికంగా హైదరాబాద్లో 188, రంగారెడ్డిలో 54, మేడ్చల్ మల్కాజిగిరిలో 16 కేసులు వెలుగు చూశాయి. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.