జైపూర్: కరోనా వైరస్ నివారణకు రెండు డోసుల టీకాలు తీసుకున్నా ఓ 65 ఏండ్ల మహిళకు ‘డెల్టా ప్లస్’ వేరియంట్కు పాజిటివ్గా వచ్చింది. రాజస్థాన్లో కొత్త వేరియంట్కు ఇది మొదటి కేసుగా నిలిచింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బికనేర్కు చెందిన సదరు మహిళ ఎటువంటి సంస్థాగత చికిత్స తీసుకోకుండానే ఇంట్లోనే ఈ వైరస్ బారి నుంచి కోలుకున్నది. ఈమె ఇటీవలనే కొవిడ్ -19 వ్యాక్సిన్ ‘కోవాక్సిన్’ రెండు మోతాదులను తీసుకున్నారు. మే 30 న పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) కు జన్యు శ్రేణి కోసం ఆమె నమూనాను పంపారు.
సదరు మహిళ నివేదికలు శుక్రవారం అందాయని, మహిళ నమూనాలో డెల్టా ప్లస్ వేరియంట్ దొరికిందని బికనేర్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఓపీ చాహర్ ధ్రువీకరించారు. ఇది రాష్ట్రంలో ధ్రువీకరించిన తొలి డెల్టా ప్లస్ వేరియంట్ కేసు అని ఆయన అన్నారు. ఆమెలో ఎలాంటి లక్షణాలు లేవని, ప్రస్తుతం ఇంటి వద్ద కోలుకుంటున్నదని ఆయన చెప్పారు. ఆమె ఇప్పటికే కోవాక్సిన్ రెండు మోతాదులను తీసుకున్నదని డాక్టర్ చాహర్ తెలిపారు.
బికనేర్లోని సర్దార్ పటేల్ మెడికల్ కాలేజీ యాజమాన్యం కొవిడ్-19 రోగుల 10 యాదృచ్ఛిక నమూనాలను సెక్సజెనరియన్ మహిళతో పాటు.. జన్యు శ్రేణి కోసం ఎన్ఐవీకి పంపారు. ఇంతకుముందు కొవిడ్ తో బాధపడుతున్న ఈ మహిళ కుటుంబంలో ముగ్గురు సభ్యులు కూడా కరోనా వైరస్కు గురై ఇంటి వద్దనే చికిత్స పొంది కోలుకున్నారు.
ఇదిలాఉండగా, శుక్రవారం 131 కేసులతో రాజస్థాన్ కొవిడ్-19 సంఖ్య 9,51,826 కు పెరిగింది. కొత్త మరణాలు ఏవీ రికార్డ్ కనందున మరణాల సంఖ్య 8,905 గానే ఉన్నది. 131 కేసుల్లో 17 కేసులు జోధ్పూర్ నుంచి నమోదయ్యాయి. ఈ వైరస్కు గురై ఇప్పటివరకు మొత్తం 9,41,048 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,873 పాజిటివ్ కేసులు ఉన్నాయి.
లేహ్లో రక్షణ మంత్రి పర్యటన.. మాజీ సైనికులతో భేటీ
ప్రజా ఉద్యమంగా తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి – వెంకయ్య నాయుడు
సహాయకురాలికి ముద్దిచ్చిన మంత్రి రాజీనామా
హాంగ్కాంగ్ యాపిల్ డెయిలీ మూసివేత
బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..