నాంపల్లి కోర్టులు, మే 4 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు, నీటి కొరత కారణంగా ఈ నెల 14 నుంచి వచ్చేనెల 6 వరకు ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లో హాస్టళ్లు, మెస్లను మూసివేస్తున్నట్టు సోషల్ మీడియాలో తప్పుడు మెసేజ్లను పోస్టు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ను ఒక రోజుపాటు పోలీస్ కస్టడీకి తరలిస్తూ నాంపల్లిలోని 4వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం చంచల్గూడ జైలులో ఉన్న క్రిశాంక్ను ఆదివారం ఉదయం ఓయూ పోలీసు స్టేషన్కు తరలించి సాయంత్రం 5 గంటల్లోగా కోర్టులో హాజరుపర్చాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ఆయనను జైలు నుంచి నేరుగా ఉస్మానియా దవాఖానాకు తీసుకువెళ్లి వైద్య పరీక్షలు పూర్తయ్యాక పోలీస్ స్టేషన్కు తరలించనున్నారు.