హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కోత్వాల్గూడ వద్ద ముందు వెళ్తున్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. మృతులను వనస్థలిపురానికి చెందిన భార్య భర్తలుగా గుర్తించారు. ఈ ఘనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.