కరీంనగర్: జిల్లాలోని మానకొండూరు (Manakondur) మండలం ముంజంపల్లిలో ఘోర రోడ్డుప్రమాదం జరాగింది. ముంజంపల్లి వద్ద కరీంనగర్-వరంగల్ ప్రధానరహదారిపై కారును ఎదురుగా వస్తున్న లారీ ఢొకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న దంపతులు మృతిచెందగా, ఇన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో చిక్కకుపోయిన మృతదేహాలను కష్టంమీద బయటకు తీశారు. మృతులను వరంగల్ జిల్లాలోని కాశిబుగ్గకు చెందిన దంపతులు సురేందర్, మాధవిగా గుర్తించారు. మేఘన, అశోక్ గాయపడ్డారని, ప్రస్తుతం వారు దవాఖానలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.