Suicide : జనగామ జిల్లా కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో దంపతులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జనగామ పట్టణంలోని వీవర్స్ కాలనీలో అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మృతులు తమిళనాడుకు చెందిన వారుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. భర్త సెల్వరాజు (55), భార్య భాగ్యలక్ష్మి (45) కుటుంబ కలహాలతో కలతచెంది ఈ దారుణానికి ఒడిగట్టినట్టు వెల్లడైంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.