హైదరాబాద్ : బీఆర్ఎస్తోనే దేశ ప్రగతి సాధ్యమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం కూకట్పల్లి, మూసాపేట డివిజన్లకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల యువకులు బొట్టు విష్ణు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ దేశానికి దిక్సూచిగా నిలిచారని కొనియాడారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఇతర రాష్ట్రాల ప్రజలు నివ్వెరపోతున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అమలు చేస్తున్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కూడా లేవని వెల్లడించారు. ప్రజలకు నిస్వార్థంతో సేవ చేయాలన్న దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకు నడుస్తున్నారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిరంతర విద్యుత్ సరఫరా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పించన్లు, ఒంటరి మహిళలకు పింఛన్లు, దళితబంధు పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజానికాన్ని ఆదుకుంటున్నారని తెలిపారు. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కోట్లాది నిధులు కేటాయించి ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు, స్కైవేలు, స్కైవాక్లు నిర్మించి ప్రత్యేకతను చాటుకున్నారని తెలిపారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కమలాకర్, బాదల్సింగ్, బొట్టు సురేశ్, ప్రేంకుమార్, గౌడ్ల రమేశ్, యువకులు పాల్గొన్నారు.