హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): నోటరీతో కొనుగోలు చేసిన స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జూలై 26న జారీ చేసిన జీవో 84ను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ వారంపాటు వాయిదా పడింది. ఈలోగా ప్రభుత్వం తమ వాదనలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది. జీవో 84ను కొట్టేయాలని కోరుతూ భాగ్యనగర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కే శ్రీనివాస్ దాఖలు చేసిన పిల్పై ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్తో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.