యూ అండ్ మీ అవగాహన కార్యక్రమాలు
6, 7, 8 తేదీల్లో దోమలగూడ ఏవీ కాలేజీ వేదిక
హిమాయత్నగర్/హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 30 : ఒత్తిడిని ఎలా అధిగమించాలి? పిల్లలు ఎదుర్కొంటున్న ఆందోళనకర పరిస్థితులు ఏంటి? తల్లిదండ్రుల ప్రవర్తన తదితర మానసిక సమస్యలకు యూ అండ్ మీ సంస్థ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. దోమలగూడలోని ఏవీ కాలేజీ వేదికగా ‘మానసిక సమస్యలపై చర్చిద్దాం.. పరిష్కారం చూపిస్తాం’ థీమ్తో వచ్చే 6, 7, 8 తేదీల్లో కౌన్సెలింగ్ కార్యక్రమం జరుగనున్నది. కరోనా సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదుర్కొన్న సమస్యలను రికార్డు చేసిన సైకాలజిస్టులు వాటికి సంబంధించిన విషయాలపై ఈ కార్యక్రమంలో చర్చించనున్నారు. ఈ మేరకు బుధవారం యూ అండ్ మీ కన్వీనర్ డాక్టర్ సీ వీరేందర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ సైకాలజిస్టులు మానసిక ఆరోగ్యంపై చర్చించి, పరిష్కార మార్గాలు చూపుతారని వెల్లడించారు. హైదరాబాద్లోని అన్ని కాలేజీల విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ సెషన్స్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మరింత సమాచారం కోసం 9390771469 నంబర్ను సంప్రదించాలని సూచించారు.