Council of Higher Education | 2024-25 విద్యాసంవత్సరానికి కామన్ ఎంట్రెన్స్ టెస్టుల తేదీలను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇటీవల ఖరారు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లు శనివారం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎప్సెట్ కన్వీనర్గా జేఎన్టీయూహెచ్ ప్రొఫెసర్ బీ డీన్ కుమార్కు బాధ్యతలు అప్పగించింది.
పీజీఈసెట్ కన్వీనర్గా జేఎన్టీయూహెచ్ ప్రొఫెసర్ అరుణ కుమారి, ఐసెట్ కన్వీనర్గా కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్ నర్సింహాచారి నియమించింది. ఈసెట్ కన్వీనర్గా ఓయూ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, లాసెట్, పీజీ ఎల్సెట్ కన్వీనర్గా ఓయూ ప్రొఫెసర్ విజయలక్ష్మి, ఎడ్సెట్ కన్వీనర్గా ఓయూ ప్రొఫెసర్ మృణాళిని, పీఈసెట్ కన్వీనర్గా ఓయూ ప్రొఫెసర్ రాజేశ్కుమార్ నియామకమయ్యారు.
ఇదిలా ఉండగా.. ఉమ్మడి ప్రవేశ పరీక్షలు మేలో ప్రారంభం కానున్నాయి. మే 9 నుంచి 11 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ కోర్సులకు ఎంట్రెన్స్ పరీక్ష జరుగనున్నది. మే 12, 13 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మాసీ ప్రవేశ పరీక్ష జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో జరుగనున్నది. ఈసెట్ ప్రవేశ పరీక్ష ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరుగనుండగా.. మే 6వ తేదీర పరీక్ష నిర్వహిస్తారు. బీఈడీ కోర్సులో ప్రవేశం కోసం ఉద్దేశించిన టీఎస్ ఎడ్ సెట్ పరీక్ష మే 23న జరుగనుండగా.. నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరుగుతుంది.
టీఎస్ లా సెట్ ఎంట్రన్స్ టెస్ట్ జరుగనున్నది. జూన్ 3న ఎల్ఎల్ఎం ఎంట్రెన్స్ టెస్టు జరుగనుండగా.. లాసెట్, పీజీ ఎల్సెట్లను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తుంది. ఐసెట్ ప్రవేశ పరీక్ష జూన్ 4, 5 తేదీల్లో జరుగనుండగా.. కాకతీయ యూనివర్సిటీ నిర్వహణలో జరుగుతుంది. ఎంటెక్, ఎం ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం ఉద్దేశించిన పీజీఈసెట్ పరీక్ష జూన్ 6 నుంచి 8 తేదీల మధ్యలో నిర్వహించనున్నారు. హైదరాబాద్ జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్టులు జరగనున్నాయి. బీపీఎడ్, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీఈసెట్ పరీక్ష జూన్ 10 నుంచి 13వ తేదీల మధ్యలో నిర్వహించనున్నారు. ఈ ఎంట్రెన్స్ టెస్టును శాతవాహన యూనివర్సిటీ నిర్వహిస్తుంది.