నల్లగొండ, ఏప్రిల్ 12(నమస్తేతెలంగాణ ప్రతినిధి): దేశవ్యాప్తంగా బీఆర్ఎస్కు, సీఎం కేసీఆర్కు వస్తున్న ఆదరణను చూసి ఓ ర్వలేకనే కాంగ్రెస్, బీజేపీ కుట్ర లు చేస్తున్నాయని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలన్నా.. దేశంలో ప్రజా సంక్షేమమే ఎ జెండాగా పాలన సాగాలన్నా కేసీఆర్ నాయకత్వంతోనే సాధ్యమన్నారు. రెండు జాతీయ పార్టీలకు రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు. తెలంగాణలో ఆ పార్టీలకు అధికారం పగటిక లేనని ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కా ర్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఫెడరల్ వ్యవస్థను కాపాడాలంటే కేసీఆర్ నాయకత్వంలో అంద రూ కలిసికట్టుగా ముందుకు సాగాలని సూ చించారు.
కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ పార్లమెంట్లో అదానీపై చర్చకు సైతం కేంద్రం వెనుకడుగు వేసిందన్నారు. ఇటీవల రాష్ట్రం లో జరిగింది ప్రధాని మోదీ పర్యటనా? లేక బీజేపీ నాయకుడి పర్యటనా? అనేది అర్థం కా లేదని తెలిపారు. అధికారిక కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి ఏం సం బంధమని ప్రశ్నించారు. ప్రధాని మోదీ ప్ర సంగం కూడా రాష్ట్రాన్ని తీవ్రంగా నిరుత్సాహపర్చిందని, రాష్ర్టానికి ఏం ఇచ్చారో చెప్పలేక విషం కక్కారని మండిపడ్డారు. రాష్ర్టానికి చెందిన బీజేపీ, కాం గ్రెస్ అధ్యక్షులు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదన్నారు.
అంతర్జాతీయ సంస్థలన్నీ తెలంగాణ వైపు చూస్తుండటం, కేంద్ర ప్రభుత్వం విభాగాల వారీగా ఇచ్చే అవార్డులన్నీ రాష్ర్టానికే వస్తుండటం నిజం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు ఇంతకంటే నిదర్శనం ఏమీ కావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను అడ్డంపెట్టుకొని రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో గవర్నర్ తీరుతో బిల్లుల ఆమోదం కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సి రావడం దురదృష్టకరమని అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్లో పాల్గొనాలనుకోవడంలో సీఎం కేసీఆర్కు గొప్ప ఉద్దేశం ఉన్నదని, ప్రభుత్వరంగ ఆస్తులను కాపాడటంలో భాగమే ఈ ఆలోచన కావచ్చని గుత్తా వ్యాఖ్యానించారు.