నల్లగొండ : మహిళలే ఇంటిల్లిపాదికి ఆధారమని, స్వశక్తితో వారు ఎదగాలనే సంకల్పం గొప్పదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukhender Reddy )కొనియాడారు. నల్గొండ పట్టణానికి చెందిన మహిళలు జననీ, మాతృశ్రీ సంస్థల్లో టైలరింగ్, బ్యూటీషియన్ ట్రైనింగ్ పొందిన వారికి కుట్టుమిషన్లు(Sewing machines), బ్యూటీషియన్ కిట్లను గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ యువ నాయకులు గుత్తా అమిత్ రెడ్డి ఉచితంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ పని చేస్తోందని గుత్తా అమిత్ రెడ్డి అన్నారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం ఉంటేనే కుటుంబాన్ని ముందుకు నడపగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో కనగల్ జడ్పీటీసీ చిట్ల వెంకటేశం, స్థానిక కౌన్సిలర్ యామ కవిత, అభిమన్యు శ్రీనివాస్, బీఆర్ఎస్ సీనియర్ నేతలు యామ దయాకర్, ఐతగొని స్వామి గౌడ్, గోపాల్ రెడ్డి, వెంకటేశ్వర రావు, హరికృష్ణ, ఇంద్రసేనా రెడ్డి, జగన్మోహన్ రావు, పరమేష్ , మాతృశ్రీ, జననీ శిక్షణ సంస్థల ఆర్గనైజర్ రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.