స్టేషన్ ఘన్పూర్/పెద్దపల్లి, నవంబర్ 3 : పత్తికి మార్కెట్లో రికార్డు స్థాయి ధర లభిస్తున్నది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్మార్కెట్లో బుధవారం క్వింటాల్ ధర రూ.8,700 పలికింది. కాగా పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం క్వింటాల్ పత్తికి గరిష్ఠ ధర రూ.8,300 లభించింది.