కాశీబుగ్గ, అక్టోబర్ 30: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి ధర క్వింటాల్కు రూ.7130 పలికింది. భారత ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్కు రూ.7,020 ఉండగా ఇక్కడ రూ.110 అధికంగా పలికింది. మార్కెట్కు మొత్తం 5,772 బస్తాలు వచ్చాయని, అత్యధికంగా మొదటి రకం పత్తికి క్వింటా రూ.7,130, మధ్యరకానికి రూ.7,100, కనిష్ఠంగా రూ.5,600 పలికినట్టు పత్తి యార్డు సూపర్వైజర్ గంగాధర్ తెలిపారు. వరంగల్ జిల్లా సంగెం మండలం నార్లవాయి గ్రామానికి చెందిన కుసం స్వామి మార్కెట్కు 21 పత్తి బస్తాలు తీసుకొచ్చాడు.