వరంగల్ : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం రికార్డు స్థాయిలో పత్తి ధర పలికింది. ఈ సీజన్ అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన పత్తిలో అత్యధికంగా క్వింటాకు రూ.7,840 ధర పలికింది. వరంగల్ రూరల్ జిల్లాలోని దుగ్గొండి మండలంలో గల శివాజీనగర్ గ్రామానికి చెందిన రైతు కోండ్లే సదయ్య 22 బస్తాల పత్తిని మార్కెట్కు తీసుకువచ్చాడు. కవిత ఎంటర్ప్రైజెస్ అడ్తి ద్వారా భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ కాటన్ ఖరీదు వ్యాపారి క్వింటాకు రూ.7,840లతో కొనుగోలు చేశారు.
ఈ సీజన్ అక్టోబర్ నుంచి అత్యధికంగా మంగళవారం ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి బరుపాటి వెంకటేశ్రాహుల్ తెలిపారు. కాగా, మార్కెట్కు మంగళవారం 1221 క్వింటాళ్లు వచ్చింది. అత్యధికంగా రూ.7840, మధ్య రకానికి రూ.6820, కనిష్ఠంగా రూ.5810 ధర పలికాయి.
ఇవి కూడా చదవండి..
యునెస్కో గుర్తింపుతో రామప్ప మరింత అభివృద్ధి
Tokyo Olympics: బ్రెస్ట్స్ట్రోక్ చాంపియన్గా 17 ఏళ్ల లిడియా జాకొబీ
బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి చేరికలు